YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి

తమిళనాడులోని సేలం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మృతి చెందగా 37 మంది గాయపడ్డారు. సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై మమంగం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 37 మంది గాయపడ్డారు. సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న ఓ బస్సును.. బెంగళూరు నుంచి సేలంకు వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండు బస్సుల్లో ఉన్న 37 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలిలో వర్షం కురుస్తుండటంతో సహాయకచర్యలకు కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. ఆ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది.

Related Posts