YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రధాన రహదారులన్నీ జలమయం

ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు  ప్రధాన రహదారులన్నీ జలమయం

దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అత్యంత రద్దీగా ఉండే రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.లోని రోడ్ సమీపంలోని ఐరన్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఖజూరి చౌక్‌, వజీరాబాద్‌ రోడ్, భజన్‌ పురా మెయిన్‌ మార్కెట్‌, అప్సర బోర్డర్‌, యమునా మార్గ్‌, ఎంజీఎం రింగ్‌ రోడ్‌, వికాస్‌ మార్గ్‌ లోని ఐపీ పైవంతెన వంటి ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అటువైపుగా రావొద్దని ప్రయాణికులకు ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. ఢిల్లీలో పరిస్థితిపై ఓ అధికారి మాట్లాడుతూ...‘ సెంట్రల్‌ దిల్లీలోని ప్రధాన కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా నిలిచింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించాం. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ అలెర్ట్‌ ప్రకటించాం. కొన్ని చోట్ల నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

Related Posts