YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రేపటితో ముగియనున్న ఆర్ ఎస్ ఎస్ బైఠక్

 రేపటితో ముగియనున్న ఆర్ ఎస్ ఎస్ బైఠక్

కర్నూల్ జిల్లా మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు  ఆదివారంతో ముగియనున్నాయి. శుక్రవారం నాడు ప్రారంభమమయ్యాయి. సెప్టెంబర్ రెండో తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై చర్చిస్తున్నారు. ఈ సమావేశాలకు హజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని దర్శించుకొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఎంపిక చేసిన సుమారు 200కు పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ‌వ్యాప్తంగా ఆర్థిక, సేవా, విద్య రంగాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌ను సిద్దం చేసే విషయం గురించి సైతం ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ప్రతి ఏటా రెండు దఫాలు నిర్వహించే సమావేశాల్లో భాగంగానే ఈ సమావేశాలు సాగుతున్నాయని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. 

Related Posts