YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

అడ్డంగా బుక్కైన కేరళ మంత్రి..

అడ్డంగా బుక్కైన కేరళ మంత్రి..

- ప్రజల సొమ్ము  మసాజ్ పాలు 

- ప్రభుత్వ సొమ్ముతో మసాజ్  చేయించుకున్న ఆర్ధిక మంత్రి 

తన మసాజ్ కోసం ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారు ఓ మంత్రి. అది కూడా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఆర్థిక మంత్రి కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. కేరళ ఆర్థిక శాఖ మంత్రి టీఎస్‌ థామస్‌ గత వారం కేరళలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌లో ఎన్నో కఠినమైన నిర్ణయాలను తీసుకున్నారు. అయితే తన సొంత ఖర్చుల కోసం రూ.1.20లక్షలు ఖజానా నుంచి తీసుకున్నారని వార్తలు బయటకు రావడంతో ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా 2016 డిసెంబరులో కొట్టకల్‌ ఆర్య వైద్యశాలలో థామస్‌ మసాజ్‌ చికిత్స చేయించుకున్నారు. అప్పుడు రూమ్‌ అద్దె‌ రూ.80వేలు సహా రూ.1.20 లక్షల బిల్లును ప్రభుత్వ సొమ్ము నుంచి కట్టినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయి. దీంతో పలువురు మంత్రిపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల కేరళ స్పీకర్‌ పి.శ్రీరామకృష్ణన్‌ కూడా రూ.50వేల ఖరీదైన కళ్లజోడుకు రాష్ట్ర ఖజానా నుంచి రీయంబర్స్‌మెంట్‌ ‌ తీసుకుని వివాదంలో చిక్కుకున్నారు.

Related Posts