YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

మనీ లాండరింగ్ కేసులో మీసాపై తీర్పు రిజర్వు

మనీ లాండరింగ్ కేసులో  మీసాపై తీర్పు రిజర్వు

 రూ.8000 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్‌, తదితరులపై దాఖలైన అనుబంధ ఛార్జిషీటుపై ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8న కోర్టు తీర్పు వెలువరించనుంది. జనవరి 4న మీసా భారతి, శైలేష్ ‌కుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుబంధ ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో మీసా భారతి దంపతులపై ఈడీ తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది. అంతకుముందు బినామీ ఆస్తుల కేసులో మిసా భారతి, ఆమె భర్తపై ఫైనల్ అటాచ్‌మెంట్ ఉత్తర్వును ఆదాయం పన్ను శాఖ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మీసా, శైలేష్‌ను గత జూలైలో ఇంటరాగేట్ చేశారు.

Related Posts