YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశవ్యాప్తంగా ఒక రోజు మెడికల్ షాపుల బంద్

దేశవ్యాప్తంగా ఒక రోజు మెడికల్ షాపుల బంద్

ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలను అనుమతించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఔషధ విధానాన్ని తీసుకురాబోతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. 'ఆల్‌ ఇండియా కెమిస్ట్స్‌ & డ్రగిస్ట్స్‌ అసోసియేషన్‌' సెప్టెంబరు 28న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'తెలంగాణ కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌' కూడా రాష్ట్రంలో మెడికల్ షాపుల బంద్‌ పాటించనున్నట్లు స్పష్టం చేసింది.  ప్రిస్కిప్షన్‌ లేకుండా ఔషధాలను ఆన్‌లైన్‌లో అమ్మడం డ్రగ్స్‌ చట్టం నిబంధనకు వ్యతిరేకమన్నారు. దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల మంది డ్రగిస్టులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 20వేల మంది ఉండగా, వారిపై ఆధారపడి సుమారు కోటి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తే రోగులతోపాటు మెడికల్ షాపుల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సెప్టెంబరు 28న ఒక్కరోజు 'దేశవ్యాప్త బంద్‌'ను పాటిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించపోతే నిరసన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

Related Posts