- హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వై.కె.రెడ్డి
నగరంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా రాత్రిపూట చలి వణికిస్తుంటే పగలు ఎండ వేడెక్కిస్తోంది. తాజాగా బుధవారం ఒక్కసారిగా మారిపోయింది. రోజంతా ఆకాశం మబ్బులు పట్టింది. పగలు, రాత్రి సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వై.కె.రెడ్డి తెలిపారు. ఈ ప్రభావంతో గురువారం అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.మరి ఆ సమయం లోపలే బయట పనులు ముగించుకుని ఎవ్వరిళ్లకు వాళ్ళు చేరుకుంటే మంచిది.