YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు అక్టోబర్ రెండో వారంలో 5రాష్ట్రాల షెడ్యూల్ విడుదల?

నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు     అక్టోబర్ రెండో వారంలో 5రాష్ట్రాల షెడ్యూల్ విడుదల?

  నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్,  మిజోరాంతో పాటే... తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. సీఈసీ రావత్‌ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో సభ్యులు సునీల్‌ అరోరా, అశోక్‌ లావాస పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఉమేష్‌ సిన్హా కమిటీ నివేదికపై చర్చించారు. వారం పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు రానుంది. ఆ తర్వాత ఎన్నికల తేదీలపై ఈసీ తుది కసరత్తు చేయనుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. అక్టోబర్ రెండో వారంలో 5రాష్ట్రాల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Related Posts