YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భర్తతో హానీమూన్...తర్వాత ప్రియుడితో జంప్

భర్తతో హానీమూన్...తర్వాత ప్రియుడితో జంప్

ఓ యువకుడిని ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ఒత్తిడికి తలొగ్గి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లైన రెండు వారాల తర్వాత భర్తతో హనీమూన్‌కు వచ్చిన ఆమె అట్నుంచి అటే ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరుపూరు జిల్లా ఉడుమలైపేట ప్రాంతానికి చెందిన యువతికి రెండు వారాల కిందట వివాహమైంది. అయితే, అప్పటికే ఆమె మరో యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లాడింది. నవ దంపతులు హనీమూన్‌ కోసం సోమవారం నాడు కొడైకానల్‌కు చేరుకున్నారు. అన్నాసాలైలోని ఓ లాడ్జిలో బస చేసి, రెండు రోజులపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నవ వధువు హఠాత్తుగా అదృశ్యమైంది. ఈ విషయం గురించి కుటుంబసభ్యులు, బంధువులకు భర్త సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పళనికి చెందిన ఓ యువకుడిని ఇది వరకే ఆమె ప్రేమించినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే ఈ వివాహం చేసుకున్న ఆ యువతి, ఆ యువకుడితో పారిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Related Posts