YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మా పార్టీని ఓడించండి...

మా పార్టీని ఓడించండి...
ఓవైపు రాఫెల్ ఒప్పందంలో భారీ అవినీతి చేసిందంటూ బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శల దాడికి దిగుతుంటే... మరోవైపు సొంతపార్టీ నేతల నుంచి సైతం నిరసన సెగ తగులుతోంది. రాఫెల్ డీల్‌పై బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా ఏర్పడి 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునివ్వడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని తవ్లి గ్రామంలో  వ్యవసాయదారుల సమావేశంలో శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) సంస్థను పక్కనపెట్టి, వేరే కంపెనీతో రాఫెల్ లాంటి కీలక ఒప్పందాన్ని ఎలా చేసుకుందని ప్రశ్నించారు. ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ కంపెనీ డస్సాల్ట్‌ ఏవియేషన్‌కు భాగస్వామిగా రిలయన్స్‌‌ను కేంద్ర ప్రభుత్వమే సిఫార్స్ చేసిందని ఫ్రాన్స్‌ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యవసాయదారుల సమావేశంలో శత్రుఘ్న సిన్హాతో పాటు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పాల్గొని ప్రసంగించారు. ఫ్రాన్స్‌తో 58 వేల కోట్ల విలువచేసే 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాఫెల్ ఒప్పందాన్ని బీజేపీపై తమ ప్రధాన విమర్శనాస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది

Related Posts