YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

ఫీజుల ఒత్తిడితో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

ఫీజుల ఒత్తిడితో బీటెక్ విద్యార్ధిని  ఆత్మహత్య

ప్రైవేట్ కాలేజీలో ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కాలేజీ యాజమాన్యాలు డబ్బులే పరమావధిగా భావిస్తున్నారు. ఫీజుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ కాలేజీ ధన దాహానికి విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా కర్నూలులో ఫీజుల జులుంకి బీటెక్ విద్యార్ధిని ప్రశాంతి బలైంది. ప్రశాంతి కర్నూలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది.

ఇంజనీరింగ్ కాలేజ్‌ యాజమాన్యం వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే మనస్తాపం చెందిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Related Posts