YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మంచి పరిపాలనాదక్షులు ఎన్డీ తివారి: గవర్నర్‌ నరసింహన్‌

 మంచి పరిపాలనాదక్షులు ఎన్డీ తివారి: గవర్నర్‌ నరసింహన్‌
మాజీ గవర్నర్ ఎన్డీ తివారి మరణం పట్ల గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా  గవర్నర్‌ నరసింహన్‌తోపాటు సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, అధికారులు తివారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తివారీతో తనకున్న పరిచయాన్ని నరసింహన్ గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలు కాపాడటంలో ఆయన ఎంతగానో కృషి చేశారని గవర్నర్ అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించారని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా తివారీ చేసిన సేవలు మరువలేనివని వ్యాఖ్యానించారు. తివారీ మరణంతో దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని నరసింహన్‌ అన్నారు. 

Related Posts