- పదిలక్షలు దాటిన కేటీఆర్ ట్విటర్ ఫాలోయర్లు
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ మైలురాయిని చేరుకున్నారు. ట్విటర్ ఫాలోయర్లకు సంబంధించి మిలియన్ జాబితాలో ఆయన చేరారు. ప్రస్తుతం కేటీఆర్ ట్విటర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య పదిలక్షలు దాటింది. తన కార్యక్రమాలు, పర్యటనలకు సంబంధించిన వివరాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాలు, వాటి ప్రభావం తదితర విషయాలను కేటీఆర్ ఎప్పటకప్పుడు ట్విటర్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. పలువురు వినతులు, ఫిర్యాదులను కూడా ట్విటర్ వేదికగానే ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారి, ప్రభుత్వ సాయం కోరే వివరాలను అందులో పొందుపర్చడం, వాటిపై కేటీఆర్ స్పందించి ప్రభుత్వం తరఫున తగు సాయం అందేలా చూస్తున్నారు. తనను అనుసరిస్తున్న వారి సంఖ్య మిలియన్కు చేరిన సందర్భంగా ‘లెట్స్ స్టే కనెక్టెడ్’ అని ఆయన స్పందించారు.