YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రోటరీ ‘ఆత్మీయం’ సదస్సు

రోటరీ ‘ఆత్మీయం’ సదస్సు

 రోటరీ ఇంటర్నేషనల్‌లో భాగమైన రోటరీ డిస్ట్రిక్ట్‌ 3150 ఆధ్వర్యంలో ‘ఆత్మీయం’ పేరుతో రెండు రోజుల పాటు రోటరీ డిస్ట్రిక్ట్‌ సదస్సు జరుగనుందని డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ జె.అబ్రహం తెలిపారు. ఈనెల 10, 11వ తేదీల్లో రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సదస్సు ఛైర్మన్‌ ప్రసాద్‌ సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పియర్స్‌ అధ్యక్షులు పి.భుజంగరావులతో కలిసి వివరించారు. రోటరీ క్లబ్‌ 8మంది డైరెక్టర్లు ఉండగా అందులో ఇద్దరు పీటర్‌ ఇబ్లర్‌, ఇ.భాస్కర్‌ ఈ సదస్సులో పాల్గొంటున్నారన్నారు. 3150 డిస్ట్రిక్ట్‌లో 100 క్లబ్‌లు ఉన్నాయని ఈ క్లబ్‌లకు చెందిన సభ్యులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రోటేరియన్లు కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారని తెలిపారు. అవార్డులకు వివిధ రంగాలకు చెందిన అక్కినేని సమంత, రామజోగయ్యశాస్త్రి, డా.గోపీచంద్‌, గాయని శ్రీలేఖ, సంజయ్‌సింగ్‌, మహ్మద్‌ ఇలియాస్‌, నిలోలాస్‌, విజయ్‌మోహన్‌ను ఎంపికచేసినట్లు పేర్కొన్నారు.

Related Posts