YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీకి శాంతి పురస్కారం

మోడీకి శాంతి పురస్కారం
ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం దక్కింది. మోదీని ఈ పురస్కారం వరించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. "మోదీనామిక్స్" ద్వారా ప్రభావితం చేస్తూ దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నందునకు మోదీని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ తెలిపినట్లు.. విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ రవీష్ కుమార్ తెలియజేశారు. మోదీ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం డీమానిటైజేషన్ (నోట్ల రద్దు) అని.. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సాహసోపేతమని అవార్డు కమిటీ ఛైర్మన్ క్వోన్ ఈ హైయోక్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను మెరుగు పరచుకోవడంతో పాటు.. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం, సామాజిక అభ్యుదయానికి పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ పాత్ర అద్భుతమని ప్రశంసించారు. అలాగే మేకిన్ ఇండియాతో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విజయవంతం అయ్యారని అభినందించారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా విదేశీ పాలసీని రూపొందించారని కొనియాడారు. సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ చియో చాంగ్-హో నేతృత్వంలో 12మంది సభ్యుల కమిటీ.. ప్రపంచవ్యాప్తంగా 100మందిని ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది. వారిలో దేశాధినేతలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, మతపరమైన నేతలు, స్కాలర్లు, జర్నలిస్టులు, అథ్లెట్లు, అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. కాని ప్రధాని మోదీని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రారంభమయ్యాక.. దీనిని అందుకుంటున్న 14వ వ్యక్తి మోదీ. గతంలో సియోల్ శాంతి పురస్కారం ఐక్యరాజసమితి మాజీ సెక్రటరీలుగా వ్యవహరించిన జనరల్ కోఫీ అన్నన్‌, బాన్ కీ మూన్‌లకు దక్కింది. అలాగే మరికొందరు ప్రముఖులను వరించింది. ప్రతీ రెండు ఏళ్లకు అందించే ఈ అవార్డును 2018 సంవత్సరానికి గాను మన ప్రధానికి దక్కింది. మోదీకి ఈ అవార్డును ప్రదానం చేయడంతో పాటూ.. రెండు లక్షల యూఎస్ డాలర్స్‌ను అందించనున్నారు.

Related Posts