- సాధారణంకన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి.
ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో చలి బాగా తగ్గింది. శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. మెదక్లో 15, హైదరాబాద్, ఖమ్మంలో 18 డిగ్రీలుగా నమోదయింది. పగటి పూట పలు ప్రాంతాల్లో 35 డిగ్రీలుంటోంది. ‘రాష్ట్రంలో మరో 3 రోజులు పొడి వాతావరణముంటుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సోమ, మంగళవారాల్లో బలమైన గాలులతో మోస్తరు వాన లేదా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి.’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది...