YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాషాయ జెండా బెట్టింగులు

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాషాయ జెండా బెట్టింగులు

మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందా..? లేదంటే 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? ఇప్పుడే ఏం చెప్పలేం. అభ్యర్థుల ఎంపికలో ఓ వైపు పార్టీలు తలకిందులు అవుతోంటే.. బుకీలు మాత్రం ఇక్కడ బీజేపీదే గెలుపని చెబుతున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాషాయ జెండా మళ్లీ ఎగరడం ఖాయమని నమ్ముతున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా బెట్టింగ్ సాగుతోంది. జోరుగా బెట్టింగులు సాగుతున్న వేళ.. బీజేపీపై రూ.10 వేలు బెట్టింగ్ పెట్టి.. ఆ పార్టీ గెలిస్తే రూ.11 వేలు ఇస్తామని బుకీలు చెబుతున్నారు. అదే కాంగ్రెస్‌పై రూ.4400 బెట్టింగ్ పెట్టి, ఆ పార్టీ గెలిస్తే రూ.10 వేలు తిరిగి ఇస్తామంటున్నారు. అంటే బీజేపీకే విజయావకాశాలు ఎక్కువని వారు నమ్ముతున్నారు. రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో వస్తుందని బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. టికెట్లు ఖరారైతే రేట్లు మారొచ్చు, కానీ ట్రెండ్ మాత్రం ఇలాగే కొనసాగుతుందని బుకీలు చెబుతున్నారు. ఈ సీజన్లో బెట్టింగ్ మార్కెట్ కళకళలాడుతోంది. ఏటా ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ సాగుతుంది.
బెట్టింగ్ కోసం ఫోన్ కాల్ చేసి ఎవరు అధికారంలోకి వస్తున్నారని తాము భావిస్తున్నామో చెబితే చాలు.. గెలిస్తే డబ్బులు మనకు చెల్లిస్తారు లేదంటే మనం తిరిగి ఇవ్వాలి. ఫోన్ కాల్ ద్వారానే కాదు.. మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీంతో బెట్టింగ్ రాకెట్‌ను బయటపెట్టడం పోలీసులకు కష్టంగా మారుతోంది.

Related Posts