YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి - గవర్నర్‌కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు

ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి - గవర్నర్‌కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు

ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని గవర్నర్‌కు నరసింహన్‌ను ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత జగన్‌పై దాడి జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందని అన్నారు. ఆపరేషన్ గరుడ జరుగుతోందంటున్న నటుడు శివాజీని విచారించాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ కోసమే దాడి చేశారన్న డీజీపీ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. రిపోర్టులో హత్యాయత్నం అని ఉందని.. దీనిపై విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. జగన్‌పై దాడి కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగే హక్కు గవర్నర్‌కు ఉందన్నారు. గవర్నర్‌ను కలిసినవారిలో దినేష్‌రెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, సుదీష్‌ రాంబొట్ల, రమేష్ నాయుడు తదితరులు ఉన్నారు.

Related Posts