YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

తెలంగాణా ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతోన్న టీడీపీ - మంత్రి హరీశ్ రావు విమర్శ

తెలంగాణా ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతోన్న టీడీపీ - మంత్రి హరీశ్ రావు విమర్శ

తెలుగు ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ.. కాంగ్రెస్‌తో కలిసి ఢిల్లీకి తాకట్టు పెడుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.కాంగ్రెస్ హయాంలో రైతు కడుపు ఎండిందని.. టీఆర్‌ఎస్ హయాంలో రైతు కడుపు నిండిందని అన్నారు. మెదక్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.మా పంచాయతీ ఆంధ్రా వారితో కాదు.. వలసాంధ్ర నాయకులతో. తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎల్ రమణ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నాడు. ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉత్తమ్ కుమార్.. బాబు ముందు చేతులు కట్టుకొని నిలబడటం తెలంగాణ ప్రజలను బాధించింది. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధి పరంపర కొనసాగుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో.

టీడీపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణ, ఏపీలలో వేర్వేరు ప్రయోజనాలున్నాయి. ఆనాడు కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి ఇవ్వనంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్.. చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమవుతోంది. అమరావతికి వెళ్లనిదే ఎల్ రమణ నిర్ణయాలు తీసుకునేలా ఉన్నాడా? రెండు కళ్ల సిద్ధాంతం, కన్ను కొట్టే సిద్ధాంతాలు కాదు.. కంటికి రెప్పలా కాపాడుకునే వారు తెలంగాణకు కావాలి.90 శాతం పూర్తయిన కాళేశ్వరంను కాంగ్రెస్ ఎందుకు నిలిపేస్తుంది. రైతులను సంఘటిత శక్తిగా మార్చిన రైతు సమన్వయ సమితులను ఎందుకు రద్దు చేస్తారు. అన్నింటిని వద్దు వద్దంటున్న కాంగ్రెస్‌ను ప్రజలు వద్దనుకుంటున్నారు. ఉమ్మడి మెదక్‌లో మొత్తం 10 సీట్లను గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తాం.." అని హరీశ్ రావు తెలిపారు.

Related Posts