YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ఆవిష్కరించిన మోదీ..!!

గుజరాత్ లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ఆవిష్కరించిన మోదీ..!!

 భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా నేడు అయన  విగ్రహాన్ని ఆవిష్కరించారు.. 2013 అక్టోబర్‌ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా రికార్డు సృష్టించింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఇది రెట్టింపు ఎత్తులో ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సరోవర్ డ్యామ్ తో పాటు చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.

Related Posts