YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్‌బీఐ తో రాజీకి వచ్చిన కేంద్రం కేంద్ర బ్యాంకుకు స్వతంత్రత ఉండటం చాలా ముఖ్యం: ఆర్థికశాఖ

ఆర్‌బీఐ తో రాజీకి వచ్చిన కేంద్రం కేంద్ర బ్యాంకుకు స్వతంత్రత ఉండటం చాలా ముఖ్యం: ఆర్థికశాఖ

రిజర్వ్‌ బ్యాంక్‌ స్వతంత్రతను ప్రభుత్వం గౌరవిస్తోందని, అయితే ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విస్తృత సంప్రదింపులు జరుగుతాయని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది.భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌తో రాజీధోరణిలో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో కొన్ని విశేషాధికారాలను ఉపయోగించి ఆర్‌బీఐకి మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం తొలుత భావిన్చినప్పటికి వీటికి భిన్నంగా కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా స్పందించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.‘ఆర్‌బీఐ చట్టానికి లోబడి కేంద్ర బ్యాంకుకు స్వతంత్రత ఉండటం చాలా ముఖ్యం. పాలన అవసరాల పరంగా కూడా ఇది ఆమోదయోగ్యమే. కేంద్ర ప్రభుత్వాలు దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాల మార్గదర్శకత్వంలోనే ప్రభుత్వం, కేంద్రబ్యాంకు పనిచేస్తున్నాయి. అయితే ఇందుకోసం కేంద్రం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాలపై ఎప్పటికప్పుడు విస్తృత సంప్రదింపులు జరుగుతాయి. ఇతర నియంత్రణ సంస్థల మాదిరిగానే ఆర్‌బీఐతో చర్చలు జరుగుతాయి. ఆ సంప్రదింపుల వివరాలను కేంద్రప్రభుత్వం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. కేవలం తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటిస్తాం. ఈ సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సమస్యలను అంచనా వేసి, సాధ్యమైన పరిష్కారాలను సూచిస్తూ ఉంటుంది. ఇక మీదట కూడా కేంద్రం ఇలాగే చేస్తుంది.’ అని ఆర్థికశాఖ ఆ ప్రకటనలో తెలిపింది.

Related Posts