భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్లో శని, ఆది, సోమవారాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని నగర సీపీ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1.45 నుంచి 2.35 గంటల వరకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బేగంపేట వంతెన మార్గం, గ్రీన్ల్యాండ్స్, సీఎం క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట వంతెన మార్గం, కేబీఆర్ పార్కు, బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఆయన నివాసం వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం 9.20గంటల నుంచి 10.05 వరకు ఆయన నివాసం నుంచి పార్కు హయత్ హోటల్ వరకు, ఉదయం 10.30గంటల నుంచి 11.15 వరకు పార్కు హయత్ హోటల్ నుంచి బంజారాహిల్స్లోని నివాసం వరకు మళ్లింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 4.05 వరకు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మ ఆలయం, జూబ్లీహిల్స్ రోడ్ నెం.36, దస్పల్లా హోటల్ వైపు ఆంక్షలు ఉంటాయి. సాయంత్రం 5.15గంటల నుంచి 6.05 వరకు అదేమార్గంలో మళ్లింపు ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం 3.45గంటల నుంచి 5.05 వరకు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి బేగంపేట ఎయిర్పోర్టు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.