YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దివాళీ పై ఐక్యరాజ్య సమితి స్టాంప్

దివాళీ పై ఐక్యరాజ్య సమితి స్టాంప్

దేశంలో భక్తిశ్రద్ధలతో జరుపుకునే దీపావళి పండుగకు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరుంది. దీపావళి రోజున ఇంటింటా దీపాలను అలంకరించడం, భారీ ఎత్తున బాణాసంచా కాల్చే సాంప్రదాయం ఇండియాకే సొంతం.  అందుకే, కొన్ని దేశాలు.. దీపావళి రోజున భారతీయులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఐక్యరాజ్య సమితి  మన దీపావళికి అరుదైన గౌరవం ఇచ్చింది. ‘దీపావళి’పై ప్రత్యేక స్టాంప్ను విడుదల చేసి ఔరా అనిపించింది.  ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి పోస్టల్ విభాగం (యూఎన్పీఏ) తమ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. ‘హ్యాపీ దివాలీ’ విష్ లైటింగ్తో ఉన్న ఐక్యరాజ్య సమితి ఫొటోపై.. దీపావళి స్టాంప్  షీట్ల చిత్రాన్ని ప్రదర్శిస్తూ ఈ ట్వీట్ చేశారు. ప్రతి స్టాంప్ షీట్లో 10 స్టాంప్లు ఉంటాయి. వీటి విలువ 14.95 అమెరికా డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.1100). ఐక్యరాజ్యసమితి స్టాంప్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ స్టాంప్లను  కొనుగోలు చేయవచ్చు.  భారతీయ సాంప్రదాయక పండుగల్లో ఒకటైన ‘దీపావళి’కి ఈ గుర్తింపు తీసుకొచ్చేందుకు గత ఏడేళ్లుగా శ్రమిస్తున్నారు. అమెరికాలోని భారతీయులు, యునైటెడ్ స్టేట్స్ హౌస్ సభ్యురాలు, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు కారోలైన్ బషెర్ మాలోనీ వంటి అమెరికా రాజకీయవేత్తల ప్రయత్నాల ఫలితంగా ఈ అరుదైన ‘స్టాంప్’ అందుబాటులోకి వచ్చింది.

Related Posts