YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. మిగతా రాష్ట్రాలకు దశల వారీగా జరగనుంది. రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు వచ్చేనెల ఏడో తేదీన జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగియనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్‌ ఏడో తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

Related Posts