YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చత్తీస్ ఘడ్ లో ఓటింగ్ ప్రశాంతం

 చత్తీస్ ఘడ్ లో ఓటింగ్ ప్రశాంతం
ఛత్తీస్గఢ్ శాసనసభకు ఎన్నికలు పద్దెనిమిది స్థానాల్లో సోమవారం జరిగాయి. భారీ భద్రత నడుమ జరిగిన పొలింగ్ లో  ఉదయం 11 గంటల వరకూ 16.4 శాతం పోలింగ్ నమోదైంది.  పదినియోజక వర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిగిలిన 8 స్థానాల్లో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగింది.  నారాయణపూర్, దంతెవాడ, బిజాపూర్, కొంట, మొహ్లా-మాన్పూర్, అంతగఢ్, భానుప్రతాప్పూర్, కంకేర్, కేష్కల్, కొండగావ్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఖైరాగఢ్, డొంగర్గఢ్, రాజ్నంద్గావ్, దొంగర్గావ్, ఖుజ్జి నియోజక వర్గాలతోపాటు బస్తర్, జగ్దల్పూర్, చిత్రకూట్ నియోజక వర్గాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మిగిలిన 72 స్థానాలకు ఈనెల 20 ల ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్తు ప్రభావితమున్న ప్రదేశాలోనే  సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ పద్దెనిమిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, మిగతా స్థానాల్లో బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారు.

Related Posts