YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

 ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం తొలిదశ పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు జవాన్లకు - మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు ఐదు గంటలు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు కోబ్రా కమోండో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బీజాపూర్ ఆస్పత్రికి తరలించారు. ద్వారాపురా పోలింగ్ బూత్ ఏరియాలోకి వెళ్లడానికి ఉన్న రహదారిని పేల్చేయడానికి మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ బాంబును భద్రతా దళాలు తొలగించాయి. పారిపోయిన మిగితా మావోయిస్టుల కోసం జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు.

Related Posts