YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐఈడీని పేల్చిన మావోయిస్టులు

ఐఈడీని పేల్చిన మావోయిస్టులు
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు దాడులు ముమ్మరం చేసారు.  అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బిజాపూర్ జిల్లాలో సరిహద్దు భద్రతాసిబ్బందిపై దాడి చేసారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులను ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. బిజాపూర్లోని ఘట్టి ప్రాంతంలో భద్రతాసిబ్బంది వాహనం లక్ష్యంగా మావోయిసట్లు ఐఈడీని పేల్చేశారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు, ఒక డీఆర్జీ, ఓ పౌరుడు గాయపడ్డారు. క్షతగాత్రులను బిజాపూర్లోని ఆసుపత్రికి తరలించారు.  రెండు రోజుల క్రితమే  ఛత్తీస్గఢ్లో తొలి దశ పోలింగ్ జరిగింది.  మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే 18 నియోజకవర్గాల్లో నవంబరు 12న పోలింగ్ నిర్వహించారు. ఇందులో బిజాపూర్ కూడా ఉంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. అందుకు పోస్టర్లు, కరపత్రాలు పంచారు. అయినా, భారీ బందోబస్తు నడుమ  ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక మిగతా 72 నియోజకవర్గాలకు నవంబరు 20న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. 

Related Posts