YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వీవీ ప్యాట్ తో తొలిసారి ఓటింగ్

వీవీ ప్యాట్ తో తొలిసారి ఓటింగ్
దేశంలో తొలిసారిగా సరికొత్త యంత్రాలను వినియోగిస్తున్నారు. వీవీప్యాట్‌లో కనిపించిన కాగితం ముక్క 7 సెకన్ల అనంతరం.. యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్సులోకి వెళ్లిపోతుంది. అది ఇక బయటకిరాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్లు. యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే కోర్టు అనుమతితో ఆ కాగితపు ముక్కలను పరిశీలించి, లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ సరికొత్త ఓటింగ్ విధానం ప్రత్యేకత. ఎన్నికల్లో వినియోగిస్తున్న బ్యాలెట్‌ యూనిట్‌లో 15 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు ఉంటాయి. వీటితో పాటు ‘నోటా’ మీట ఉంటుంది.ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం ఈసారి ఎన్నికల ప్రత్యేకత. ఇందుకోసం వీవీప్యాట్ (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణతో పాటు మిగిలిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తొలిసారిగా ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ సరికొత్త యంత్రం ద్వారా ఎలా ఓటు వేయాలో తెలుసుకుందాం.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడ ఓటింగ్ కోసం మూడు యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ ద్వారా మనల్ని ఓటింగ్‌కు అనుమతిస్తారు. అధికారులు చెప్పిన తర్వాత మనం ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్‌లోకి వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థులకు సంబంధించిన పార్టీల గుర్తులు ఉంటాయి. మనం మొదటగా బ్యాలెట్‌ యూనిట్‌లో మనకు నచ్చిన గుర్తుకు ఓటు వేస్తాం. ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌పై క్లిక్ చేస్తాం. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేశామో.. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీప్యాట్ యంత్రానికి అమర్చిన అద్దం వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దాన్ని పరిశీలించి మనం ఎంచుకున్న అభ్యర్థికే ఓటు పడిందా, లేదా అనే విషయాన్ని నిర్ధరించుకోవాలి. ఈ విధానంలో ఏ గుర్తుకు ఓటు వేశామో అక్కడికక్కడే కచ్చితంగా ధ్రువీకరించుకోవచ్చన్నమాట.  2004 ఎన్నికల నుంచే దీన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కొత్త యంత్రాల్లో అభ్యర్థుల ఫొటోలను సైతం పొందుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.. ఏదైనా నియోజకవర్గంలో 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే.. సంఖ్యను బట్టి అధికారులు అదనంగా మరిన్ని యంత్రాలను అమరుస్తారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఎం-3 శ్రేణికి చెందిన కంట్రోల్‌ యూనిట్లను వాడుతున్నారు. గత ఎన్నికల్లో ఎం-2 శ్రేణికి చెందినవి వినియోగించారు. వీటికి కేవలం 4 బ్యాలెట్‌ యూనిట్లను మాత్రమే అనుసంధానం చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఎం-3 శ్రేణికి 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. అంటే పోటీలో ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నా ఇబ్బంది ఉండదన్నమాట. పోలింగ్ కేంద్రంలో అధికారులు ముందుగా కంట్రోల్‌ యూనిట్‌కు బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ను అనుసంధానం చేస్తారు. తర్వాత కంట్రోల్‌ యూనిట్‌ను ఆన్‌ చేస్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ యూనిట్‌ను, వీవీప్యాట్‌ యంత్రాలను ఆన్‌ చేస్తారు. ఇదంతా పోలింగ్‌ కేంద్రం ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. అప్పుడు వారి ముందు నమూనా పోలింగ్‌ నిర్వహించి అంతా సరిగా ఉందని నిర్ధరించిన తర్వాతే ఓటింగ్‌ మొదలుపెడతారు. కంట్రోల్‌ యూనిట్‌ ద్వారా బ్యాలెట్‌ యూనిట్‌కు అనుసంధానం చేసి వీవీప్యాట్‌ను ఆన్‌ చేయగానే మొదటగా అది దానికదే కొన్ని పరీక్షలు చేసుకుంటుంది. ఈ సెల్ఫ్‌ చెకింగ్‌లో 5 పరీక్షలు. ఓటు నిర్ధరణ తెలిపే కాగితం ముక్క పొడవు సరిగా ఉందా, కాగితం కనిపించే సమయం కచ్చితంగా ఉందా, గుర్తు ముద్రణ, ముద్రణకు వినియోగించే రంగులు, బ్యాటరీ సామర్థ్యం.. వీటిని వీవీప్యాట్‌ స్వయంగా చెక్ చేసుకుంటుంది

Related Posts