YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు....59 మంది మృతి

 కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు....59 మంది మృతి
 అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అక్కడి పారడైజ్‌ నగరాన్ని కాల్చి బూడిద చేసింది. లక్షల ఎకరాలు, వేలాది ఇళ్లు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దావానలం కారణంగా ఇప్పటికే 59మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 130 మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన వారి వివరాలను బుధవారం అధికారులు విడుదల చేశారు. కనిపించకుండాపోయిన వారిలో ఎక్కువ మంది పారడైజ్‌లోని బుట్టే కౌంటీకి చెందిన వారు. వారు దాదాపు 70, 80, 90 సంవత్సరాల వయసు గల వారు. ఈ ప్రాంతం గత వారం చెలరేగిన మంటల కారణంగా నామరూపాలు లేకుండా పోయింది.సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సియెర్రా నేవెడా పర్వతాల సమీపంలో ఉన్న పారడైజ్‌ నగరంలో 26వేల మంది జనాభా ఉండేవారు. గత వారం చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి పారడైజ్‌ నగరాన్ని కాల్చేశాయి. గాలులు విపరీతంగా వీయడంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేయలేకపోయారు. సహాయక సిబ్బంది ప్రతి ఇంటిని, కాలిపోయిన వాహనాలను గాలించి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. పారడైజ్‌ నగరం మొత్తాన్ని పునాదుల నుంచి నిర్మించాలని, ఇళ్లు, వ్యాపార సముదాయాలు, మౌలిక వసతులు అన్నీ నాశనమైపోయాయని అధికారులు చెప్తున్నారు. లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. క్యాంప్‌ ఫైర్‌, వూల్సే ఫైర్‌, కాల్‌ ఫైర్‌ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Posts