YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీంలో సీబీఐ కేసు, వాదనలు

సుప్రీంలో సీబీఐ కేసు, వాదనలు
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సీవీసీ అందజేసింది. ఆ నివేదిక కాపీని సీల్డ్ కవర్ లో అలోక్ వర్మకు సుప్రీంకోర్టు ఈరోజు అందజేసింది. దీనిపై సోమవారంలోగా స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అలోక్ వర్మ తనన స్పందనను కూడా సీల్డ్ కవర్ ద్వారా తమకు అందజేయాలని తెలిపింది.ఈ నివేదిక ద్వారా పలు అభిప్రాయాలు వెలిబుచ్చిందని, వాటిలో కొన్ని అంశాలపై ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. అలోక్ వర్మ తన సమాధానం ఇచ్చిన అనంతరం తదుపరి విచారణ మంగళవారం జరుపుతామని, ఈ నివేదికను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు కూడా అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా, సీవీసీ నివేదికను తనకు కూడా ఇవ్వాలన్న రాకేశ్ ఆస్థానా అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.తన అధికారాలను రాత్రికి రాత్రే తొలగించి, సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై అక్టోబరు 26న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా విచారణ చేపట్టి, నివేదిక సమర్పించాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ‌ను ఆదేశించింది. సీవీసీ నివేదిక సమర్పించడంతో శుక్రవారం మరోసారి ఈ కేసు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. సీవీసీ సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఆరోపణలపై సీవీసీ నివేదిక సానుకూలంగా ఉందని, అయితే, మరికొన్నింటిపై విచారణ అవసరమని పేర్కొంది. ఇదే సమయంలో సీవీసీ నివేదికపై తన స్పందన తెలియజేయాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ‌ను ధర్మాసనం కోరింది.  నవంబరు 19లోగా స్పందించాలన్న న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబరు 20కి వాయిదా వేసింది. తన అభిప్రాయాలను సీల్డ్ కవర్‌లో అందజేసి సీబీఐకి ప్రజల్లో ఉన్న ప్రతిష్ఠను కాపాడాలని సూచించింది. అలోక్ వర్మ తరఫున న్యాయవాది ఫాలీ నారీమన్ హాజరయ్యారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనల్ తుషార్ మెహతాలకు సైతం సీవీసీ నివేదిక అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు సంబంధించిన విచారణ నివేదికను అందజేయడానికి మాత్రం నిరాకరించింది. అలాగే సీబీఐ డీఎస్పీ ఏకే బస్సీ తన బదిలీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్, అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే దాఖలు చేసిన పిటిషన్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని గతంలోనే సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయిక్ పర్యవేక్షణలో సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ‌పై విచారణ నవంబరు 10న సీవీసీ పూర్తిచేసింది. 

Related Posts