YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీ సీఎంపై కారంపొడి దాడి

ఢిల్లీ సీఎంపై కారంపొడి దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇక యువకుడు  అనూహ్యంగా దాడి దిగాడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పావుకేజీ కారప్పొడి పొట్లంతో అనిల్ కుమార్ శర్మ అనే వ్యక్తి సచివాలయంలోకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారం జల్లినట్టు వెల్లడించారు. సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో దీంతో కేజ్రీవాల్ కళ్లజోడు పగిలిపోయింది. నిందితుడు అనిల్ కుమార్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనిల్ కుమార్ భార్య సెక్రటేరియట్లోనే పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. కాగా అతడు సీఎంపై ఎందుకు దాడికి దిగాడన్నది ఇంకా తెలియరాలేదు.

Related Posts