YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కణం'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కణం'

నాగ‌శౌర్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'క‌ణం'. త‌మిళంలో 'క‌రు' పేరుతో రూపొందిన ఈ ద్విభాషా చిత్రానికి ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన‌ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ క‌మిటీ 'యు/ఎ' స‌ర్టిఫికేట్ జారీ చేసింది. అంతేగాకుండా, సినిమా చాలా బాగుందంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ నెల 23న ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 'ఫిదా', 'ఎంసీఏ' చిత్రాల్లో ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న‌తో మెప్పించిన సాయిప‌ల్ల‌వి.. ఈ చిత్రంలో నాలుగేళ్ళ పాప‌కి త‌ల్లిగా న‌టించ‌డం విశేషం.

Related Posts