YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజస్థాన్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకొన్న ప్రముఖులు..!!

 రాజస్థాన్ లో  ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకొన్న ప్రముఖులు..!!

రాజస్థాన్‌లో ప్రశాంతంగా శుక్రవారం పోలింగ్‌ కొనసాగుతోంది. రాజస్థాన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 41.53శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 199 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. యువత నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వృద్ధులు సైతం కుటుంబీకుల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు పలువురు ప్రముఖులు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చారు. వీరిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వసుంధర రాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, రాజస్థాన్‌ పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ ఉన్నారు

Related Posts