YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎయిర్ ఇండియా బిల్డింగ్‌పై కన్నేసిన ఎల్‌ఐసీ, జీఐసీ..!!

ఎయిర్ ఇండియా బిల్డింగ్‌పై కన్నేసిన ఎల్‌ఐసీ, జీఐసీ..!!

నిధులు లేక ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియ సతమతమవుతుంది. కనుక ఆ సంస్థ ముంబైలోని 23 అంతస్తుల భవనాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ భవనాన్ని దక్కించుకోవాలని  ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసీ, జీఐసీలు చూస్తున్నాయి. ఎయిర్ ఇండియా బిల్డింగ్ విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ పలు ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని కంపెనీ వర్గాల వెల్లడించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి జనవరి 2018 నాటికి ఈ భవంతిని కిరాయికి ఇవ్వడంతో రూ.291 కోట్లకుపైగా నిధులు సమకూరాయి.  ప్రస్తుతం సంస్థకు రూ.55 వేల కోట్ల స్థాయిలో రుణాలు ఉన్నాయి.

Related Posts