YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కశ్మీర్ లో ఘోర ప్రమాదం

కశ్మీర్ లో ఘోర ప్రమాదం
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫూంచ్ జిల్లాలోని పలేరా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ప్రమాద స్థలం పూంచ్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు పూంచ్ నుంచి లోరన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలియగానే స్థానిక పోలీసులతో పాటు సహాయ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అత్యవసర చికిత్స అవసరం ఉన్న వారిని ఎయిర్ అంబులెన్స్‌లో జమ్మూకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Related Posts