YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తుగ్లక్‌..ఔరంగబేబుల్లా ప్రవర్తిస్తున్న మోదీ..యోగి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా

తుగ్లక్‌..ఔరంగబేబుల్లా ప్రవర్తిస్తున్న మోదీ..యోగి       కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా
పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తల తెచ్చిన వారికి రూ. కోటి రివార్డు ఇస్తామంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన హిందూ యువ వాహని ఇటీవల వివాదాస్పద ప్రటకన చేసింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తుగ్లక్‌లా.. యోగి ఔరంగబేబులా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.‘అసలు దేశంలో ప్రజాస్వామ్యం అంటూ మిగిలి ఉందా..? మోదీ జీ మహ్మద్‌ బిన్ తుగ్లక్‌ లా, ఆదిత్యనాథ్‌ జీ ఔరంగజేబులా ప్రవర్తిస్తున్నారు. దేశంలో చట్టం, రాజ్యాంగం పనిచేస్తున్నాయా? లేదంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లుగానే దౌర్జన్య పాలన ఉందా’ అని సుర్జేవాలా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా బులంద్‌శహర్‌ అల్లర్ల ఘటనను కూడా ప్రస్తావిస్తూ.. ‘ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ను కాల్చి చంపారు. నిందితుల్లో భాజపా కార్యకర్తలు ఉన్నారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అలాంటి వారు ప్రజల తలలపై రివార్డులు ప్రకటిస్తారు. ఇదంతా చూస్తుంటే దేశంలో తాలిబన్‌ వ్యవస్థ నడుస్తోందా అని అన్పిస్తోంది’ అని ఎద్దేవాచేశారు.ఇటీవల సిద్ధూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. దీనిపై అసహనం వ్యక్తం చేసిన హిందూ యువ వాహని.. సిద్ధూ తల తెస్తే రూ. కోటి రివార్డు ఇస్తామంటూ ప్రకటిచింది. హిందూ యువ వాహనిని యోగి ఆదిత్యనాథ్‌ వ్యవస్థాపించారు.

Related Posts