YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా

రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా
2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధ చర్యలు కనిపిస్తుండటమే కొంత ఆశ్చర్యానికిగురిచేస్తున్నది. దేశంలో రైతు మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా పార్లమెంటులో సొం త మెజారిటీని సాధించజాలదు. మరి బీజేపీ.. రైతు మద్దతు లేకుండానే సొంత మెజారిటీ సాధించానని భావిస్తున్నదా? ఒకవేళ రైతు మద్దతు లేకుండానే మెజారిటీ సాధించామనే భ్రమలో గనుక ఉంటే బీజేపీ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నదని చెబితే తప్పుకాదు. బీజేపీ పాత రాజకీయ వ్యవహార శైలిలో రైతు లేకపోవచ్చు. కానీ కొత్తగా అది పార్లమెంటులో సాధించిన మెజారిటీలో రైతు ఉన్నాడనే విషయం కాదనలేనిది. దాంతో ఇకనైనా బీజేపీ రాజకీయంలో రైతు ప్రాధాన్యం పెరుగుతుందని భావించాం. కానీ ఆ పార్టీ వ్యవహారశైలిలో అలాంటి మార్పు కనిపించకపోవడమే కొంత అశ్చర్యాన్ని కలిగిస్తున్నది. దేశంలో బలమైన రైతు సమాజాన్ని ఎవరు దూరం చేసుకున్నా వారు అధికారానికి దూరమవుతారని దేశ రాజకీయ చరిత్ర చెబుతున్నది. గతంలోలాగా పట్టణ, వ్యాపా ర వర్గాల పార్టీగానే వ్యవహారాలు కొనసాగిస్తే బీజేపీ భవిష్యత్తు మరోసారి అంధకారమవుతుందని ఆ పార్టీ గమనించాలి. ఎవరితో పెట్టుకు న్నా ఫరవాలేదు. కానీ రైతుతో పెట్టుకుంటే బీజేపీ మళ్లీ పార్లమెంటులో పాత సీట్లకే పరిమితమవుతదనేది ఆ పార్టీ గుర్తించాల్సిన విషయం..యూపీ రైతుల రుణమాఫీ స్వయాన ప్రధాని ప్రకటిస్తే అభ్యంతరం చెప్పని రిజర్వు బ్యాంకు..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 17 వేల కోట్ల రుణమాఫీ ఒకేసారి చేయడానికి ఎందుకు అభ్యంతరం చెప్పినట్లు? రైతుల విషయంలో రాష్ర్టానికో నీతిని అవలంబించడం ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్ అవుతుందా? ఒకే దేశం, ఒకే ప్రజా అవుతుందా?ప్రధాని మోదీ సమర్థ పాలకుడే కావచ్చు. అవినీతిరహిత పాలన సాగిస్తుండవచ్చు. కానీ ఈ దేశంలో జీవిస్తున్న60 శాతం రైతు లోకం విశ్వాసం పొందడం అన్నిటికన్నా ముఖ్యమని ఆయన గుర్తుంచుకోవాలి. ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు, రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమయినా కూడా వారి డబ్బులు వారికి బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయంటే ఢిల్లీ పాలకులకు గ్రామీణ రైతుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నదో ఎవరికైనా అర్థమవుతుంది. అప్పులు దొరుకవు, ఉన్న డబ్బులు ఇవ్వరు అంటే వ్యవసాయం వదులుకొమ్మని చెప్పడమేనా? తెలంగాణలో నగ దు కొరతను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంకు రూ.2600 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఈ మధ్య వార్త! కనీసం రెండు నెలల నుంచి తెలంగాణ రైతులు బ్యాంకుల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగుతుంటే, ఇప్పుడు కేంద్రానికి కొంతైనా సోయి రావడాన్ని చూసి హర్షించాలో, నిట్టూర్చాలో అర్థం కాదు. నోట్ల రద్దును ప్రజలు సైతం పరోక్షంగా సమర్థించారు. దేశంలో అవినీతి ప్రక్షాళన జరుగాలని సగటు పౌరుడు కోరుకున్నాడు. కాబట్టే ప్రజల నుంచి సానుకూలత వచ్చింది. కానీ అది రైతుకే ఒక సమస్యగా మారుతుంటే కేంద్రం కళ్లు మూసుకొని చూస్తుండటమే తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. పెద్దనోట్ల మార్పు తర్వాత బ్యాంకుల నుంచి ప్రజలు తమ డబ్బును తీసుకుంటున్నారు తప్ప జమ చేయడం లేదనే వాదన ఉంది. దాంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పిడిందంటున్నారు. నిజానికి అదీ ఒక కారణమే అనుకున్నా.. రైతును సైతం వదలకుండా నగదు రహితం వైపు నెట్టడం మరొక కారణం. గ్రామాల్లో నగదు రహిత వ్యవస్థ ఏర్పాటు చేయకుండానే రైతును ఆ వైపు నెట్టడం కేంద్ర పాలకు ల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. నగదు రహితం తెచ్చారు తప్ప దాని ఆచరణలో రైతులు ఎదుర్కునే సమస్యలు కేంద్రానికి ఎందుకు పట్టలేకపోయాయి? నగదు రహితంతో కూలీలకు రైతు ఎలా చెల్లింపులు చేస్తాడనే సోయి కేంద్రానికి ఎందుకు లేకపోయింది?రిజర్వు బ్యాంకు గవర్నర్ రైతు రుణమాఫీని వ్యతిరేకించడం, మరోవైపు కేంద్రానికి రైతు రుణమాఫీ పట్ల ఒక స్పష్టత లేకపోవడం.. రైతు పట్ల బీజేపీ గందరగోళ వైఖరిని బయటపెడుతున్నది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వయాన ప్రధాని మోదీనే రైతుల రుణమాఫీ ప్రకటించారు. అక్కడ గెలుపు తర్వాత పార్లమెంట్‌లో స్వయాన వ్యవసాయశాఖా మంత్రి యూపీ రైతు రుణమాఫీని కేంద్రమే భరిస్తుందన్నారు. దాంతో ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల నుంచి కూడా తమ రాష్ట్ర రైతుల రుణాలు కూడా మాఫీ చేయాలనే డిమాండ్ రావడంతో నాలుక కర్చుకొని మళ్లీ మాట మార్చారు. యూపీ రైతు రుణమాఫీ ఆ రాష్ట్ర ప్రభుత్వ మే భరిస్తుందని వ్యవసాయ మంత్రి పార్లమెంటులో మళ్లీ ప్రకటించాల్సివచ్చింది. యూపీ ఎన్నికల సందర్భంగా స్వయాన ప్రధాన మంత్రే రైతు రుణమాఫీ ప్రకటించడం వల్ల దేశవ్యాప్త రైతుల్లోనూ రుణ మాఫీ పట్ల ఆశ పెరిగింది. యూపీ ఎన్నికల్లో అన్నీ తానై మాట్లాడిన మోదీ ఈ దేశానికి తాను ప్రధానమంత్రిననే విషయం కూడా మర్చిపో యి ఉంటారనిపించింది. ఏక్ దేశ్‌మే దో విధాన్ నహీ చలేంగే అనేది స్వయాన బీజేపీ రాజకీయ నినాదం. కానీ రైతు విషయం వచ్చేసరికి ఆ నినాదాన్ని బీజేపీ ఎందుకు మర్చిపోతున్నట్లు? ప్రధాని మోదీ యూపీ రైతును ఒకవిధంగా, మిగతా దేశ రైతులను మరోవిధంగా భావించారా? బీజేపీకి ఇప్పటికీ రైతు లక్షణం రాలేకపోతున్నదా? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఇతర అనేక రాష్ర్టాల రైతులు రుణమాఫీ కోసం, మద్దతు ధరల కోసం ఆందోళనలకు దిగారు. దేశవ్యా ప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధాలు జరిగాయి, జరుగుతున్నాయి. అసంఘటిత రైతు లోకం గతంలో ఏనాడూ రోడ్డెక్కి ఉద్యమించింది లేదు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు రోడ్లెక్కుతున్నాయి. పంటలు, కూరగాయలు, పాలు పండ్లు రోడ్లపై పారబోసి తమ నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీలో తమిళ రైతుల నగ్న ప్రదర్శనలు యావత్ దేశా న్ని చింతింపజేశాయి. అవన్నీ రైతు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఏకంగా పోలీసుల కాల్పుల్లో కొందరు రైతులు చనిపోవడం అందిరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఓ వైపు పోలీసు కాల్పుల్లో రైతులు చనిపోతుంటే.. మరోవైపు రాందేవ్ బాబాతో కలిసి ఈ దేశ వ్యవసాయ మంత్రి యోగాభ్యాసం చేశారు. అది వ్యవసా య మంత్రి తప్పిదం అనేకన్నా.. ఇప్పటికీ బీజేపీకి రైతు లక్షణం రాలేద ని ఆ సంఘటన చెబుతున్నదంటే తప్పు కాదేమో?పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీకి మొదటిసారి పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా మద్దతు లభించిందనే విషయం ఆ పార్టీ మర్చిపోతున్నదా? రైతు సమాజం మద్దతు లేకుండా ఆ పార్టీ సొంత మెజారిటీ సాధించేదేనా? ఇన్ని నిజాలు కళ్లముందు కనపడుతు న్నా బలమైన రైతు సమాజాన్ని ఇంత నిర్లక్ష్యంగా చూడటం బీజేపీ రాజకీయ తిరోగమనాన్ని సూచించడం లేదందామా?చివరగా.. నగదు రహితం విషయంలో ఒక పట్టణ వ్యాపారికి, గ్రామీ ణ రైతుకు ఉండే తేడాను గుర్తించని బీజేపీకి రైతు లక్షణం ఎన్నటికి అబ్బేను అనేదే శేష ప్రశ్న

Related Posts