YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏడు స్థానాల్లోని 4337 ఓట్లే బీజేపీ కొంప ముంచాయి

ఏడు స్థానాల్లోని 4337 ఓట్లే బీజేపీ కొంప ముంచాయి
మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీతో సాగిన హోరాహోరీలో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికార బీజేపీ 109 సీట్లు సాధించి.. అధికారానికి ఏడు సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ముఖ్యమంత్రిగా వరుసగా 13 ఏళ్లపాటు పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పిల్లలంతా ముద్దుగా మామ అని పిలుచుకునే చౌహాన్.. 13 ఏళ్ల పాలనలో మధ్యప్రదేశ్‌ను ప్రగతి పథంలో నడిపారు. సుదీర్ఘ కాలంపాటు బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ పట్ల వ్యతిరేకత సహజం. కానీ బీజేపీ మరోసారి అధికారం చేపట్టడానికి కేవలం ఏడు సీట్ల దూరంలోనే ఆగిపోయింది. దీన్ని బట్టే చౌహాన్ పాలనను అంచనా వేయొచ్చు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో స్వల్ప మెజార్టీతో గెలిచింది. పది స్థానాల్లో అభ్యర్థులు వెయ్యిలోపు మెజార్టీతో గెలుపొందారు. ఇందులో ఏడు చోట్ల కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ ఏడు స్థానాల్లోని 4337 ఓట్లే బీజేపీకి అధికారాన్ని దూరం చేశాయి. ఈ 4337 సీట్ల బీజేపీకి దక్కి ఉంటే.. ఆ పార్టీకి 115 సీట్లొచ్చేవి. కాంగ్రెస్ బలం 107కి పడిపోయేది. గ్వాలియర్ సౌత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పాఠక్ 121 ఓట్ల తేడాతో గెలుపొందాడు. సువస్రాలో కాంగ్రెస్ 350 ఓట్ల తేడాతో గెలిచింది. మరో ఐదు చోట్ల కాంగ్రెస్ 1000 లోపు మెజార్టీతో విజయం సాధించింది. విచిత్రం ఏంటంటే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లొచ్చాయి. అంటే తక్కువ ఓట్ల శాతం వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న మాట. ఈ ఓటమికి పూర్తి బాధ్యతను తీసుకున్న చౌహాన్.. ఎలాంటి రాజకీయాలకు అంగీకరించలేదు. పదవి కోసం పాకులాడకుండా హుందాగా తప్పుకున్నారు. కేంద్రానికి వెళ్లే అవకాశం ఉన్నా.. అలా చేయనని తేల్చి చెప్పారు. నేను మధ్యప్రదేశ్‌లోనే ఉంటా, ఇక్కడే చస్తానంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ప్రభుత్వం తప్పు చేస్తే బలమైన ప్రతిపక్షంగా నిలదీస్తామన్నారు.

Related Posts