YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఢిల్లీలో టీడీపీ ఎంపీ ఆందోళన

 ఢిల్లీలో టీడీపీ ఎంపీ ఆందోళన
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసన తెలియజేశారు. గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలు ప్లకార్డులతో ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి.. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇవాళ మరో కొత్త గెటప్‌లో కనిపించారు. 'గారడి' వేషదారణలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగారు. పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు ఒకరైతే.. మోదీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేస్తారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్‌ ఫైరయ్యారు

Related Posts