YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

శవాన్ని సూట్‌కేసులో కుక్కిన కిరాతకుడు

శవాన్ని సూట్‌కేసులో కుక్కిన కిరాతకుడు

 ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అతిదారుణంగా హత్య చేశారు. ఉత్తర ఢిల్లీలోని భాలస్వా స్వరూప్ నగర్‌లో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. కిడ్నాప్ చేసి బాలుడిని చంపి సూట్‌కేస్‌లో పెట్టి రూంలో 35రోజుల పాటు తనతోపాటు ఉంచుకున్నాడో సివిల్ సర్వీసు అభ్యర్థి. అతని రూం నుంచి చెడు వాసనలు రావడంతో హత్య ఘటన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అవదేశ్ సఖ్య (27) సివిల్ సర్వీసు (ఐఏఎస్)కు ప్రిపేర్ అవుతున్నాడు. కొన్ని నెలల క్రితం బాలుడి తండ్రికి అవదేశ్‌కి మధ్య గొడవ నేపథ్యంలో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. గతనెల 7న బాలుడికి సైకిల్ కొనిస్తానని నమ్మబలికి తీసుకెళ్లి ఇంట్లో నిర్బంధించాడు. బాలుడిని హతమార్చాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. తన బెడ్‌కిందనే 35రోజుల పాటు  ఉంచాడు. దుర్గంధపు వాసనలు రాకుండా ఉండేందుకు పర్‌ఫ్యూమ్‌లను చల్లాడు. 

మరోవైపు బాలుడు అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవదేశ్‌పై అనుమానాన్ని వ్యక్తం చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అవదేశ్ గదికి వెళ్లి ప్రశ్నించగా.. ఎలుకలు చచ్చిన వాసన అంటూ బుకాయించాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతని గదిని తనిఖీ చేయగా.. సూట్‌కేసులో బాలుడి మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టని స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో అవదేశ్‌ను విచారించగా హత్యచేసినట్టు ఒప్పుకున్నాడు.

Related Posts