YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి
జీఎస్ఎల్వీ-11 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట ప్రయోగం కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-11 ప్రయోగం జరిగింది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టనుంది. కాగా, ఈ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. భారత్ పంపిస్తున్న35వ సమాచార ఉపగ్రహం జీశాట్-7ఏ. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్- 7ఏ ఎనిమిదేళ్లపాటు సేవలందించనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11’ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనుంది. వరుస ఉపగ్రహ ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా ఒక సవాల్‌గా తీసుకుంది. 
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ  మధ్యాహ్నం 2.10 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభమైంది. జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌  రాకెట్‌ ద్వారా జీశాట్‌ 7-ఏ ఉపగ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. 

Related Posts