YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విమానాల మాదిరిగానే రైళ్లలోనూ షాపింగ్ సదుపాయం

విమానాల మాదిరిగానే రైళ్లలోనూ షాపింగ్ సదుపాయం
విమానాల్లో మాదిరిగా ఇక రైళ్లలోను షాపింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని ఇండియన్ రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సదుపారం జవనరి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు కేవలం టీ, కాఫీ, స్నాక్స్ మాత్రమే రైళ్లలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇక నుంచి సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫిట్‌నెస్‌ టూల్స్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రయాణికులు కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. తొలి విడతగా 16 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దీనిని ప్రారంభిస్తారు. ప్రయోగాత్మకంగా పశ్చిమ రైల్వే డివిజన్ పరిధిలో అమలు చేస్తారు. ఇందుకు సంబంధించి పశ్చిమ రైల్వే ముంబయి డివిజన్‌ ఓ ప్రైవేటు సంస్థకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టు కింద లైసెన్సు మంజారు చేసింది. 
లైసెన్స్ మంజూరు కావడంతో 16 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఐదేళ్ల పాటు సదరు సంస్థ గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువులను విక్రయించనుంది. అయితే.. ఎలాంటి తినుబండారాలు, సిగరెట్లు, మత్తుపానీయాలు మాత్రం అమ్మరాదు. ఐదేళ్ల కాంట్రాక్టు మొత్తం విలువ రూ.3.6 కోట్లు. విక్రయించే వస్తువులకు సంబంధించిన క్యాట్‌లాగ్ సహా యూనిఫాం ధరించిన ఇద్దరు సిబ్బంది అమ్మకాలు జరుపుతారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వస్తువులు అందుబాటులో ఉంటాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతోనూ వీటిని కొనుగోలుచేసే సదుపాయం ఉంది. అలాగే ఉత్పత్తుల గురించి బిగ్గరగా అరుస్తూ ప్రచారాలు నిర్వహిండాన్ని కూడా నిషేధించామని ఆ అధికారి తెలిపారు. మొదటి దశలో భాగంగా మూడు రైళ్లలో ఈ సదుపాయాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఇతర రైళ్లలోను ప్రారంభిస్తారు. 

Related Posts