YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటన ఖరారు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటన ఖరారు
భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు నూతన సంవత్సరం జనవరి 4 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారని ఏపీ ప్రభుత్వ ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ ఎం.అశోక్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జవనరి 4న సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకోనున్నారు. 5న ఉదయం గం.9.50 నిమిషాలకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నానికి విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు చేరుకుంటారు. 5న సాయంత్రం గం.4 లకు లయోలా కాలేజీ శతవసంతాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 6న ఉదయం 9 గంటలకు గన్నవరం సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెడికల్ క్యాంపును ప్రారంభించనున్నారు. 6న సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారని అశోక్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Related Posts