YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వేతన సవరణ చేయాలని, బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ధర్నా సమ్మె నిర్వహిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు

వేతన సవరణ చేయాలని, బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ధర్నా సమ్మె నిర్వహిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు

వేతనాలను సవరించాలని, బ్యాంకుల విలీనం ను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సిద్దిపేట మోహినిపురా ఎస్ బి ఐ బ్యాంకు ముందు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ బి ఐ ఓ హెచ్ సి రామచంద్రపురం రీజినల్ సెక్రెటరీ ఎన్. సంతోష్ కుమార్ మాట్లాడారు. విజయ, దేనా   బ్యాంకుల విలీనం తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వెంటనే బ్యాంకుల విలీనం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు మొండి బాకీల వసూలు చట్టం, ఎన్ పీ ఎ చట్టం ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ కాన్ఫెడరేషన్ ప్రతినిధులు, దుబ్బాక, తోగుట ,హుస్నాబాద్, చేర్యాల ,సిద్దిపేట, కోహెడ, బెజ్జంకి ,దూల్మిట్ట తదితర బ్యాంకుల సిబ్బంది రాజేశ్వర్, కనకయ్య, శివకుమార్, సత్తయ్య ,నాగ శాంతి ,నరేందర్ రెడ్డి, కిరణ్, రమేష్ ,శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts