- వాట్సాప్ పేమెంట్స్ కు భద్రత లేదు
- స్వలాభం కోసం యూపీఐ వ్యవస్థ దుర్వినియోగం
- పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ధ్వజం
వాట్సాప్ పేమెంట్స్ ను అనుమతిస్తే ఎవరి చేతికైనా తెరిచి ఉన్న ఏటీఎంను ఇచ్చినttenani పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అన్నారు. ఫేస్ బుక్ (వాట్సాప్ యజమాని) బహిరంగంగా మన చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)ను స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (యూపీఐను అభివృద్ధి చేసిన సంస్థ)కు ఫిర్యాదు చేస్తానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని శర్మ చెప్పారు.
వాస్తవానికి వాట్సాప్ అన్నది కేవలం ఇన్ స్టాల్ చేసుకుని మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ అయ్యే వేదికని స్పష్టం చేశారు..ఇతరత్రా వివరాలు ఏవీ అవసరం లేదన్నారు.దీన్ని సెక్యూరిటీ పరంగా ముప్పు అని వాట్సాప్ పై శర్మ మండిపడ్డారు.