YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోఅన్ని స్థానాలకు ఎంఎన్‌ఎం పోటి ఎంఎన్‌ఎం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోఅన్ని స్థానాలకు ఎంఎన్‌ఎం పోటి      ఎంఎన్‌ఎం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌
 వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఎంఎన్‌ఎం పార్టీ పోటీ చేస్తుందని  ఎంఎన్‌ఎం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.‘2019 లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా. మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు త్వరలోనే కమిటీని ఏర్పాటుచేయనున్నాం’ అని కమల్‌ తెలిపారు. తమిళనాడు అభివృద్ధే ధ్యేయంగా తమ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా పొత్తుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కూటముల గురించే ఇప్పుడే చెప్పలేమని, అయితే తమిళనాడు డీఎన్‌ఏను మార్చేందుకు ప్రయత్నించే ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని కమల్‌ స్పష్టంచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా చెబుతూ వస్తోన్న కమల్‌ ఆ అంశంపై ఈ రోజు ఓ స్పష్టత ఇచ్చారు.

Related Posts