YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక సిఎం కుమారస్వామిపై బీజేపీ విమర్శల దాడి తక్షణం క్షమాపణలు చెప్పాలని డీమాండ్

కర్ణాటక సిఎం కుమారస్వామిపై బీజేపీ విమర్శల దాడి               తక్షణం క్షమాపణలు చెప్పాలని డీమాండ్

:మాండ్య జిల్లాలో జేడీఎస్ నేత ప్రకాష్‌ను పొట్టనబెట్టుకున్న హంతకులను కాల్చి పారేయండంటూ వ్యాఖ్యలు చేసి కెమెరాకు చిక్కిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై బీజేపీ విమర్శల దాడి చేసింది. ఇంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన సీఎం తక్షణం క్షమాపణలు చెప్పాలని డీమాండ్ చేసింది. రాష్ట్రంలో రైతులు చనిపోయినప్పుడు ప్రభుత్వ అధికారులు హతమైనప్పడు ఇలా ఎప్పుడైనా స్పందించారా అని బీజేపీ రాష్ట్ర యూనిట్ ఓ ట్వీట్‌లో సీఎంపై మండిపడింది.కుమారస్వామి వ్యాఖ్యలను బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి మాటలొస్తాయని నేను ఏనాడూ అనుకోలేదు. ఆయనే ఇలా మాట్లాడితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మాటేమిటి, ఇది పూర్తిగా కుమారస్వామి బాధ్యతారాహిత్య ప్రకటన అని ఆయన అన్నారు.మారస్వామి కెమెరాకు ఇలా చిక్కారు...జేడీఎస్ నేత ప్రకాష్‌ హత్యపై కుమారస్వామి ఎవరితోనే ఫోనులో మాట్లాడుతూ ఆయన (ప్రకాష్) చాలా మంచి వ్యక్తి. అతన్ని వాళ్లెందుకు హత్య చేశారో నాకు తెలియదు. అలాంటి వాళ్లని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండి. ఎలాంటి సమస్యా లేదు అని ఆదేశాలిచ్చారు. ఇదంతా కెమెరాకు చిక్కడంతో సీఎం ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా తాను ఆదేశాలివ్వలేదని ఆ నిమిషంలో భావోద్వేగంతో అన్న మాటలేనని అన్నారు. ప్రకాష్ హంతకులు అంతకుముందు రెండు హత్యలు చేసి జైలులో ఉన్నారని రెండ్రోజుల క్రితమే వాళ్లు బెయిలుపై బయటకు వచ్చారని చెప్పారు. బెయిల్‌పై వచ్చి మరో హత్య చేయడమంటే ఇది బెయిల్‌ దుర్వినియోగానికి పాల్పడటమేనని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

Related Posts