YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బోగీబీల్‌ వంతెనను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిన్‌సుకియా-నహర్ల్‌గన్‌ పట్టణాల మధ్య 500 నుంచి 100 కి.మీ. తగ్గనున్న దూరం

బోగీబీల్‌ వంతెనను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిన్‌సుకియా-నహర్ల్‌గన్‌ పట్టణాల మధ్య 500 నుంచి 100 కి.మీ. తగ్గనున్న దూరం

దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన ఈశాన్య రాష్ట్రాలకు మరో మణిహారమైన బోగీబీల్‌ వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు.. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని ఈ వంతెనను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం వంతెనపై కొంత దూరం నడిచి నిర్మాణాన్ని పరిశీలించారు. మోదీ వెంట అసోం గవర్నర్‌ జగదీష్‌ ముఖీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ కూడా ఉన్నారు.అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. రూ.5,920 కోట్లతో నిర్మించిన ఈ డబుల్‌ డెక్కర్‌ వంతెన వల్ల అసోంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్‌ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ప్రయాణ దూరం 500 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గనుంది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా పేర్కొనే ఈ బొగిబీల్‌ వంతెన రక్షణ పరమైన అవసరాలకూ, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి చక్కని మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. యుద్ధ విమానాలు సైతం దీనిపై దిగేందుకు వీలుగా నిర్మాణం చేపట్టారు. భారత్‌-చైనా సరిహద్దులో భద్రతను మరింత బలోపేతం చేయడంతో ఈ వంతెన కీలక పాత్ర పోషించనుంది. ఈ బోగీబీల్‌ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన వంతెన నిర్మాణం.. శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు పూర్తయింది. 

Related Posts