YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కనీస వేతన పెంపు కల సాకారం

Highlights

కింది స్థాయి ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌?

కనీస వేతన పెంపు కల సాకారం

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కనీస వేతన పెంపు కల సాకారం కానుందా. దాదాపు 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయా? తాజా నివేదికల ప్రకారం త్వరలోనే కనీస వేతనంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 7 వ వేతన కమిషన్ సిఫార్సులను ప్రకటించిన పద్దెనిమిది నెలల తర్వాత, మోదీ సర్కార్‌ కనీస వేతన పెంపును ఒక రియాలిటీగా మార్చేందుకు కృషి చేస్తోంది. కనీస వేతన పెంపును గ్రేడ్1 నుంచి గ్రేడ్‌ 5వరకు కింది స్థాయి ఉద్యోగులకు ఉపయోగడేలా నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థిక శాఖకార్యాలయ సీనియర్‌ అధికారి తెలిపారు.

Related Posts