YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దారితప్పిపోయిన రైల్..

Highlights

  •  గంటలు కనిపించకుండాపోయిన రైలు
దారితప్పిపోయిన రైల్..


 అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరో రైలు దారి తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి బీహార్‌లో సహర్స వెళ్లాల్సిన గ‌రీబ్‌ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ మధ్యలో రెండు గంటలు కనిపించకుండాపోయింది. ఘజియాబాద్ జంక్షన్‌లో ఆ రైలు దారి తప్పింది. దీంతో యూపీలోని మొరాదాబాద్ వెళ్లాల్సిన రైలు.. అలీగఢ్‌వైపు రాంగ్‌రూట్‌లో వెళ్లింది. గంటన్నర తర్వాతగానీ డ్రైవర్ కూడా రైలు రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్లు గుర్తించలేకపోయాడు. వెంటనే రైలును ఆపాడు. విషయాన్ని అధికారులకు చెప్పాడు. ఘజియాబాద్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు వచ్చిన రైలు.. దారి తప్పింది. డ్రైవర్ సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ రైలు ఎక్కడుందో గుర్తించి మళ్లీ ఘజియాబాద్‌కు తీసుకొచ్చారు.ఆ తర్వాత మళ్లీ మొరాదాబాద్‌ వైపు వెళ్లింది. ఈ ఘటనపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది.

Related Posts